హైదరాబాద్కు మీరేం చేశారు?: తలసాని
ఎక్కడ చూసినా తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని
హైదరాబాద్: ఎక్కడ చూసినా తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు ప్రజల మధ్య ఉందన్నారు.
నగరంలోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తలసాని చెప్పారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, పార్కులు ఇలా చాలా అభివృద్ధి చేశామన్నారు. కరోనా, వరదల సమయంలో ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వమేని చెప్పారు. నగరానికి వస్తున్న కేంద్రమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడకుండా తెరాసపైనే విమర్శలు చేస్తున్నారని తలసాని ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.