అవినీతి వైకాపా.. అంతానికే మా పొత్తు
రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విరుచుకుపడ్డారు.
జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది
మద్యనిషేధం అని చెప్పి.. మద్యం సిండికేట్ నడుపుతున్నారు
అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పేట్రేగిపోతున్నారు
అమరావతిని పునర్నిర్మిస్తాం
తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతాం
ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్షా
మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట
గూబ గుయ్ అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అనంతపురం: రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విరుచుకుపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎం అయ్యాక తానే మద్యం సిండికేట్ నడిపిస్తూ నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్న అమిత్షా.. జగన్ పాలనలో అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూమాఫియా, అరాచకాలు, అవినీతిలో వైకాపా ప్రభుత్వం కూరుకుపోయిందని.. ఐదేళ్లలో రూ.13.50 లక్షల కోట్ల అప్పుల్ని ప్రజల నెత్తిపై పెట్టిందని విరుచుకుపడ్డారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. ఇప్పుడు 25కి 25 లోక్సభ సీట్లు.. మూడింట రెండొంతుల అసెంబ్లీ సీట్లు ఎన్డీయే కూటమికి ఇవ్వండి. చంద్రబాబు ముఖ్యమంత్రి, మోదీ ప్రధాని అవుతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు’’ అని హామీ ఇచ్చారు.
అమరావతిని పునర్నిర్మిస్తాం
‘‘వైకాపా గూండాలను అణచివేయడానికి.. రాష్ట్రంలో వైకాపా అవినీతిని పూర్తిగా అంతం చేసేందుకే భాజపా, తెదేపా, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఏడుకొండల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతాం. తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తాం. జగన్ తెలుగు భాషను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చి తెలుగును సమాధి చేసే కుట్ర చేస్తున్నారు. భాజపా అది జరగనివ్వదు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సీఎం జగన్కు ఆహ్వానం పంపినా రాలేదు. అలాంటి వ్యక్తికి మీరంతా ఓట్లు వేస్తారా? దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడ్డాక... అమరావతిని పునర్నిర్మిస్తాం. పోలవరంతో పాటు హంద్రీ-నీవానూ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 100 సీట్లకు పైగా ఎన్డీయే గెలుచుకుంటుంది. అన్ని విడతల్లో కలిపి 400 సీట్లు సాధించే దిశగా దూసుకుపోతున్నాం’’ అని అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మోదీ చేతుల్లోనే దేశం సురక్షితం
‘‘నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇండియా కూటమిలో ఏ పార్టీకీ నిలకడ లేదు. ఆ కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో స్పష్టత లేదు. నరేంద్రమోదీ మాత్రమే దేశాన్ని సురక్షితంగా ఉంచుతారు. మళ్లీ ప్రధాని అయితే 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తారు. 10కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.3లక్షల కోట్లు ఖాతాల్లో జమచేస్తారు. 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడమే మోదీ లక్ష్యం’’ అని అమిత్షా పేర్కొన్నారు.
భూములన్నింటినీ దోచుకునే కుట్ర
-చంద్రబాబు
పట్టాదారు పాస్పుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. ‘‘తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకోవాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట.. అదేమైనా వాళ్ల నాన్న, తాత, నాన్నమ్మ ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘‘కొత్తగా ఓ చట్టం తీసుకొచ్చారు. మొత్తం భూములన్నీ ఆన్లైన్లో ఉంటాయట. అమ్ముకోవాలంటే అనుమతి కావాలి. పట్టాదారు పాస్పుస్తకం కాకుండా జిరాక్స్ ఇస్తారట. అది ముక్కు తుడుచుకోవడానికైనా పనికొస్తుందా? రాష్ట్రంలోని భూములన్నింటినీ దోచేందుకు కుట్రచేస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మీ ఆస్తులకే ఎసరుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వ్యక్తికి ఎన్నికల్లో గూబ గుయ్మనాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు.
శవ రాజకీయాలు చేసే జగన్ను ఇంటికి పంపిద్దాం
‘రూ.200 ఉన్న పింఛన్ను రూ.2వేలు చేసింది తెదేపానే. మొట్టమొదట పింఛన్లు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. ఇప్పుడు పింఛను సాయాన్ని రూ.4వేలకు పెంచుతామని హామీ ఇస్తున్నా. ఏప్రిల్ నుంచి బకాయిల్ని కలిపి జులైలో ప్రతి ఒక్కరికీ రూ.7వేలు అందిస్తాం. వికలాంగులకూ బకాయితో కలిపి రూ.12వేలు ఇస్తాం. చేతులు, కాళ్లు లేనివారికి ప్రతినెలా రూ.15వేలు ఇస్తాం. పింఛనుదారులపై కుట్రకు తెరతీసిన జగన్.. మళ్లీ శవ రాజకీయం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛను ఇవ్వకుండా వృద్ధులను సచివాలయానికి రప్పించారు. చనిపోయిన వారికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మళ్లీ బ్యాంకుల్లో ఖాతాల్లో నగదు వేశారు. సచివాలయ ఉద్యోగులను వదిలేసి బ్యాంకుల చుట్టూ తిప్పే పరిస్థితి వచ్చింది. శవ రాజకీయాలు చేసే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే కేంద్రం సహకారంతో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టే బాధ్యత నాది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే పదేళ్ల తర్వాత కూడా మన రాజధాని ఏదో చెప్పుకోలేం. పోలవరానికి కట్టుబడి ఉన్నామని నరేంద్రమోదీ చెప్పారు. జగన్ అవినీతికి పాల్పడుతూ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని అమిత్షా అన్నారు. పోలవరంతో పాటు హంద్రీ-నీవా పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని హామీ ఇస్తున్నా.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ కల నెరవేరుతోంది
‘‘మహిళలకు 33శాతం రిజర్వేషన్ కావాలని ఎప్పటినుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేదు. రైతుల కోసం కేంద్రం రూ.6వేలు ఆర్థికసాయం చేస్తోంది. మొత్తం 12,500 ఇస్తామని హామీ ఇచ్చిన జగన్.. రాష్ట్రం వాటా రూ.7,500 మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నారు. ప్రతి రైతుకూ రూ.20వేలు ఇచ్చే బాధ్యత తెదేపా తీసుకుంటోంది. 90% సబ్సిడీతో మళ్లీ బిందుసేద్యం తీసుకొస్తాం’’ అని చంద్రబాబు హమీ ఇచ్చారు.
నా స్నేహితుడు సత్యకుమార్ను గెలిపించండి
ధర్మవరం నియోజకవర్గ బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థి సత్యకుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అమిత్షా కోరారు. ఇది తన వ్యక్తిగత విజ్ఞప్తి అని చెప్పారు. సత్యకుమార్ తనకు చిరకాల స్నేహితుడని తెలిపారు. సత్యకుమార్ను గెలిపిస్తే కేంద్రం సహకారంతో ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తారని, ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హిందూపురం లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
అనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లు
విజయంపై ధీమా వ్యక్తం చేసిన అమిత్షా
సభ అనంతరం చంద్రబాబుతో ప్రత్యేక భేటీ
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఏపీలో తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి వస్తున్నట్లు తమవద్ద పూర్తి సమాచారం ఉందంటూ తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి అమిత్షా చెప్పినట్లు సమాచారం. ధర్మవరంలో సభ అనంతరం హెలిప్యాడ్ వద్ద వారిద్దరూ ప్రత్యేకంగా ముచ్చటించారు. తమకున్న నివేదికల ప్రకారం ఏపీలో కూటమికి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని అమిత్షా తెలిపినట్లు, ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నట్లు నివేదిక అందిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం కోసం ఎండను కూడా లెక్కచేయకుండా రోజుకు మూడుసభల్లో పాల్గొనడంపై చంద్రబాబును అమిత్షా అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే