Kadiyam Srihari: ఆ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది: ఎమ్మెల్యే కడియం
అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని స్టేషన్ ఘన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని స్టేషన్ ఘన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ మేరకు ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
‘‘హైదరాబాద్ సభలో పాల్గొని ప్రియాంకా గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిండు సభలో నిరుద్యోగభృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారు. పంట రుణాలు తీసుకోని వాళ్లు.. బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని కడియం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు