Modi: గుజరాత్ ఓటింగ్.. వివాదంలో మోదీ ‘నడక’
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ.. పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లడం వివాదానికి దారితీసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
గాంధీనగర్: గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్ సోమవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటేసేందుకు వచ్చిన ప్రధాని.. కొద్ది దూరం నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలింగ్ (Gujarat Polling) వేళ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మోదీ ‘రోడ్ షో’ చేపట్టారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది.
ఈ ఉదయం అహ్మదాబాద్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆ సమయంలో తన కాన్వాయ్ నుంచి దిగిన మోదీ (Modi).. పోలింగ్ కేంద్రం వరకు నడుచుకుంటూ వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా.. దారిపొడవునా వారికి అభివాదం చేశారు. దీనిపై కాంగ్రెస్ (Congress)పార్టీ తాజాగా స్పందిస్తూ.. ప్రధాని, ఈసీపై విమర్శలు గుప్పిచింది.
‘‘అహ్మదాబాద్లో ఓటెయ్యడానికి వెళ్లిన ప్రధాని.. రెండున్నర గంటల పాటు రోడ్ షో చేపట్టారు. దీన్ని అన్ని ఛానళ్లు ఉచితంగా కవర్ చేశారు. ఇది ప్రచారం కాదా? రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ, పాలనాయంత్రాంగం, ఎన్నికల సంఘం అన్నీ ఒక్కటైపోయినట్లు కన్పిస్తున్నాయి. మోదీ రోడ్షోపై ఈసీ మౌనంగా ఉంది. ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చూస్తుంటే.. ఈసీ ఇష్టపూర్వకంగానే ఒత్తిడికి తలొగ్గినట్లు కన్పిస్తోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా దుయ్యబట్టారు. మోదీ ‘నడక’పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా మోదీ తీరును తప్పుబట్టింది. ‘‘ఎన్నికల సంఘం నిబంధనలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలి. ఎన్నికల రోజున రోడ్షోలపై నిషేధం ఉంటుంది. కానీ వారు(భాజపా, మోదీని ఉద్దేశిస్తూ) ప్రత్యేక వ్యక్తులు కదా..! వీవీఐపీలు ఏదైనా చేయగలరు’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శించారు.
ఖండించిన భాజపా..
అయితే.. ఈ ఆరోపణలను భాజపా నేతలు తిప్పికొట్టారు. ‘‘మోదీ కాన్వాయ్ను పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరం నిలపాల్సి వచ్చింది. అందుకే ప్రధాని నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం లోపలికి వాహనాన్ని తీసుకెళ్లలేం కదా? కాంగ్రెస్ కావాలనే రెచ్చగొడుతోంది’’ అని భాజపా నేతలు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
3 గంటలకు 50శాతం పోలింగ్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.5శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 14 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను రానున్నాయి. గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబరు 8న ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్