Sonia Gandhi: దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది: సోనియా గాంధీ
భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని
దిల్లీ: భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలు పెంచడంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా లేదని సోనియా గాంధీ అన్నారు. ఏడాది పొడవునా సాగిన ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులకు ఘన నివాళి అర్పించాలని పార్టీ నేతలకు సూచించారు. రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఆమోదయోగ్యమైనది కాదని, చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదన్నారు. సస్పెన్షన్కు గురైన ఎంపీలకు మద్దతుగా నిలవాలని పార్టీ ఎంపీలకు సోనియా గాంధీ సూచించారు.
మరోవైపు 12 మంది రాజ్యసభ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని రాజ్యసభలోని విపక్ష పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం