Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మంగళగిరి: బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగిందని తెలిపారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు.
‘‘పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కృషికి నిన్నటి సభతో ఫలితం వచ్చింది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మూడు పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుంది. వైకాపా అవినీతిని ప్రధాని మోదీ ప్రజల ముందు ఉంచారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీనిపై ఎన్నికల అధికారికి సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తాం.’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వైకాపాపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది: ధూళిపాళ్ల నరేంద్ర
బొప్పూడి ప్రజాగళం సభలో వైకాపాపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైకాపాను ఓడించాలనే కసితో ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పారు. ప్రధాని సభకు సరైన భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్కింగ్ ప్రదేశాలున్నా పోలీసుల వైఫల్యంతో ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ప్రజలకు ప్రధానే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వ దోపిడీ వల్ల ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు