Andhra News: సీఎం జగన్ చేసేది పరిపాలనా?లేక వడ్డీ వ్యాపారమా?: నాదెండ్ల మనోహర్
గిట్టుబాటు ధరలు రాక, పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి నీటి తీరువా వసూలు విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం
అమరావతి: గిట్టుబాటు ధరలు రాక, పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి నీటి తీరువా వసూలు విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం అప్రజాస్వామికంగా ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం దారుణమన్నారు. కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం.. భవిష్యత్తులో పంట నష్టం పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన చేస్తున్నారా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా?అని నిలదీశారు. గత నెలలో ఆస్తి పన్ను పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు రైతుల మీద పడిందని నాదెండ్ల ఆక్షేపించారు. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటి పన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలును టార్గెట్ పెట్టారని.. మరి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పిన సీఎం జగన్, నెలలు గడిచినా రైతులకు చెల్లించడం లేదన్నారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికి వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలన్నారు. ప్రణాళిక, రైతుల పట్ల కనీస బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని ధ్వజమెత్తారు. పాలనా పరమైన వైఫల్యాల వల్లే రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటివరకూ 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వీరిని ఆదుకోవడానికి ముందుకురాని రాష్ట్ర ప్రభుత్వం.. వసూళ్లు మాత్రం వడ్డీతో సహా చేస్తోందని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వడ్డీ వ్యాపారం మానేసి ప్రజలకు సరైన పరిపాలన అందించాలని నాదెండ్ల హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!