Lokesh: నిరుద్యోగులకు నారా లోకేశ్‌ బహిరంగ లేఖ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

Published : 02 Feb 2024 20:14 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరుద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌ చేస్తున్న మోసాలు చూసి నిరుద్యోగులు ఆందోళన చెంద వద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ఉన్న పోస్టులను ఎత్తి వేసేందుకు వైకాపా ప్రభుత్వం జీవో 117 తెచ్చింది. ఈ జీవో ద్వారా 65 వేల ఉద్యోగాలు రద్దయ్యాయి. తెదేపా-జనసేన ప్రభుత్వం రాగానే టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. అప్రెంటీస్‌ విధానం రద్దు చేసి పూర్తి పేస్కేల్‌ అమలు చేస్తాం’’ అని లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని