Nara lokesh: జగన్ అవినీతి స్టార్.. ఏ స్కీమ్ తీసుకొచ్చినా స్కామే: నారా లోకేశ్
సీఎం జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని.. రాజధాని పేరుతో ఆయన ఎన్ని జే టర్న్లు తీసుకున్నారో అందరికీ తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
విజయనగరం: సీఎం జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని.. రాజధాని పేరుతో ఆయన ఎన్ని జే టర్న్లు తీసుకున్నారో అందరికీ తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విజయనగరం నియోజకవర్గం శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.
‘‘చంద్రబాబు పిలుపుతో ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం అమరావతి రైతులు భూములిచ్చారు. అలాంటి రైతులను జగన్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. యువతకు దొరక్కుండా పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు. జగన్.. ఒక అవినీతి స్టార్.. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చిన అందులో స్కామే ఉంటుంది. ఇళ్ల స్థలాల్లో శంకుస్థాపనల పేరిట రూ.2 వేల కోట్లు కొట్టేశారు. చంద్రబాబు ఒక నిప్పులా బతికిన వ్యక్తి. ఆయన్ను చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయి. జగన్ను చూస్తే ‘బూమ్ బూమ్’లు గుర్తొస్తాయి. గోదావరి నీళ్లను విజయనగరం ప్రాంతానికి తీసుకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. తెదేపా అధికారంలోకి వస్తే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.