Caste Census: జనాభాలో 73 శాతం.. టాప్-200 కంపెనీల్లో ఒక్కటీ వారి చేతుల్లో లేదు: రాహుల్ గాంధీ
కులగణనను దేశ ఎక్స్-రేగా పునరుద్ఘాటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దీనిద్వారా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
ప్రయాగ్రాజ్: దేశ జనాభాలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 73 శాతంగా ఉన్నారని.. అయితే, భారత్లోని టాప్-200 సంస్థల్లో ఒక్కటీ వారి యాజమాన్యంలో లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. కులగణన (Caste Census)ను దేశ ఎక్స్-రేగా పునరుద్ఘాటిస్తూ.. దీని ద్వారా అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని అలహాబాద్ యూనివర్సిటీ సమీపంలో ప్రసంగించారు.
దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరంటే..?
‘‘కులగణన మీ ఆయుధం. మీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలి. దేశ సంపదలో మీ వాటా ఎంత అనేది కనుక్కోవాలి’’ అని యువతను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలోని టాప్ 90 ఐఏఎస్ అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ వర్గాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. దేశంలోని 10-15 మంది బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన రూ.14 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించారు. ఏనాడూ రైతుల రుణాల గురించి పట్టించుకోలేదన్నారు.
అమేఠీకి స్మృతి ఇరానీ, రాహుల్..
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీలు సోమవారం అమేఠీలో వేర్వేరుగా పర్యటించనున్నారు. ‘న్యాయ్ యాత్ర’లో భాగంగా పట్టణంలో రాహుల్ రోడ్ షో నిర్వహించనున్నారు. గతంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకే సమయంలో ఈ ఇద్దరు నేతలు అమేఠీలో పర్యటించడం ఐదేళ్లలో ఇది రెండోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం