Nellore: నెల్లూరులో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్న అధికారులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నెల్లూరు: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు ఈ ధర్నాను అణచివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్నారు. ఏఎస్పేటలో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించారు. ఆత్మకూరులోని ఎల్.ఆర్.పల్లిలో స్థానికులు అడ్డుకోవడంతో.. అధికారులు, వాలంటీర్లు వెనుదిరిగారు.
తాళాలు పగలగొట్టడం చట్ట విరుద్ధం: సీపీఎం
అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్నారని.. తాళాలు పగల గొట్టడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా