CM Revanthreddy: మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం: రేవంత్రెడ్డి
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
మహబూబ్నగర్: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్నగర్లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారాస బిల్లా రంగా సమితి..
‘‘పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటా. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించా. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాం. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా. కేటీఆర్, హరీశ్రావును చూస్తే.. భారాస ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.
పదేళ్లు కాంగ్రెస్దే అధికారం..
వంశీచందర్రెడ్డిని ఎంపీగా, జీవన్రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించండి. కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారు? త్వరలోనే పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నాం. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం. 11 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చు.. కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట. ఇదెక్కడి న్యాయం? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామనడం.. దేశానికి మంచిదా? విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలకు పాతరేయాలి. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు.. మా జోలికొస్తే అంతు చూస్తాం. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి కేసీఆర్ను రోడ్డుకు ఈడ్చా. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్గాంధీ ప్రధాని కావాలి’’ అని సీఎం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!