Pawan Kalyan: కడియంలో పాడైన పంటలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

Updated : 10 May 2023 16:15 IST

కడియం: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్‌.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ కల్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని