Pawan Kalyan: కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి: పవన్ కల్యాణ్
వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ
అనంతపురం: వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందజేసిన తర్వాత మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.
‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. వారి కష్టం కళ్లారా చూశా. మరో దారి లేకపోతేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుంది. రైతు కష్టం తెలుసుగనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నా. కౌలు రైతుల కష్టాలను పంచుకుంటాం. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం. పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారు. రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. వారి బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే... ఏసీ గదుల్లో కూర్చుని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడే.. ఈ క్షణమే ఏర్పాటు చేస్తున్నాం. సంక్షేమ నిధిలో సగం డబ్బు నేనిస్తాను, మిగిలిన సగం మా పార్టీ నేతలు ఇస్తామని మాట ఇచ్చారు.
కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు తొలుత మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమంది చనిపోయారని మేం ఆర్టీఐ ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నాం. జనసేన కార్యకర్తల ద్వారా పూర్తి వివరాలు సేకరించాం. వీటన్నింటినీ క్రోడీకరించాం. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు ఎంతమంది చనిపోయారు అంటే.. ఆ జాబితా జనసేన వద్ద ఉంది. ప్రభుత్వం వద్ద కూడా లేదు. అధికారంలోకి వస్తే మీ కన్నీరు తుడుస్తాం. నన్ను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే.. జగన్ను సీబీఐ దత్తపుత్రుడు అంటాం. వైకాపా నాయకులు చాలా మందిని సీబీఐ ప్రేమగా దత్తత తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేం ఎవరికీ బీ టీమ్ కాదు.. ఇంకోసారి అలా అంటే చర్లపల్లి షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. నేను ఎవరికీ భయపడను. నాకు స్వార్థం లేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ