Payyavula: ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూశా: పయ్యావుల

తెదేపా అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Updated : 02 Nov 2023 15:43 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు.  

రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకు సాగిన 14 గంటల ప్రయాణంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారని.. చరిత్రలో లేని విధంగా జనం వచ్చారని పయ్యావుల చెప్పారు. చంద్రబాబు ఎక్కడా కారు దిగలేదన్నారు. ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో తాను చూశానని పయ్యావుల తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తాము ముందే చెప్పామన్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబును జైలులో ఉంచారని.. 50 పైసలైనా ఆయనకు వచ్చాయని నిరూపించగలిగారా? అని పయ్యావుల కేశవ్‌ నిలదీశారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే ఆరోపణలు నిజమవుతాయా? అని ఆయన మండిపడ్డారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని