Vijayan: ‘యూపీ కేరళలా మారితే..’ యోగి భయమంతా అందుకే: సీఎం విజయన్‌ కౌంటర్‌

యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కౌంటర్‌ ఇచ్చారు. భాజపాకు ప్రజలు ఓటు వెయ్యకుండా .....

Updated : 10 Feb 2022 16:38 IST

తిరువనంతపురం: యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కౌంటర్‌ ఇచ్చారు. భాజపాకు ప్రజలు ఓటు వెయ్యకుండా తప్పు చేస్తే.. ఉత్తరప్రదేశ్‌ కూడా ఓ కశ్మీర్‌, కేరళ, బెంగాల్‌లా మారుతుందన్న యోగి వ్యాఖ్యలపై ట్విటర్‌లో దీటుగా స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కేరళలా మారిపోతే ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమం, మంచి జీవన ప్రమాణాలు, మతాలు, కులాల పేరిట హత్యల్లేని ఓ సామరస్య సమాజం ఏర్పడుతుందనే యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నారంటూ చురకలంటించారు. యూపీ ప్రజలు ఇలాంటి అభివృద్ధే కోరుకుంటున్నారని విజయన్‌ పేర్కొన్నారు.

మరోవైపు, కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను విజయన్‌  ట్విటర్‌లో వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద రూ.17,183 కోట్ల వ్యయంతో చేపట్టిన 1,557 ప్రాజెక్టుల్లో భాగంగా 53 కొత్త పాఠశాల భవనాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆ పాఠశాలల భవనాలను ట్విటర్‌లో పంచుకున్నారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు. ఫలితంగా 9.34లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని