బిహార్ పోల్స్:12 ర్యాలీల్లో మోదీ ప్రచారం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు .......
దిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు ప్రచార జోరును మరింతగా పెంచాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన 12 ర్యాలీల్లో పాల్గొంటారని భాజపా నేత, బిహార్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్న దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. తొలి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23న ససరాంలో తొలి ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అదే రోజు గయా, భాగల్పూర్లలోనూ ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 28న (తొలి విడత పోలింగ్ రోజు) దర్భంగా, ముజఫర్పూర్, పట్నాలలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఫడణవీస్ వెల్లడించారు.
రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 1న చంపారన్, సమస్థిపూర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే, చివరి విడత ఎన్నికల ప్రచారం నవంబర్ 3న పశ్చిమ చంపారన్లో ప్రారంభమై సహస్ర, అరారియాలతో ముగుస్తుందని ఫడణవీస్ తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపా - జేడీయూ మరికొన్ని పార్టీలు కలిసి ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగిన నేపథ్యంలో జేడీయూ అధినేత, సీఎం నితీశ్కుమార్కు ఓటు వేయాలని తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను కోరనున్నారు. బిహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనునున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు