PM Modi: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం: ప్రధాని మోదీ

ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు.

Updated : 17 Mar 2024 15:41 IST

అమరావతి: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబు, పవన్‌తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం’’ అని పేర్కొన్నారు. మరి కాసేపట్లో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగే సభలో ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు