Chandrababu: బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు.
కావలి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘బాబాయిని చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలుపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. చట్టాలపై గౌరవం లేదు.
ఎన్టీఆర్.. తెదేపా ప్రారంభించిన గొప్ప రోజు ఇది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అవుతారని నేనెప్పుడూ ఊహించలేదు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. వైకాపా నేతలు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. దళారి వ్యవస్థకు బీజాలు వేసిన వ్యక్తి జగన్. వైకాపా నేతలు వస్తుంటే జనం పారిపోతున్నారు. మిట్టమధ్యాహ్నం కూడా మా సభలకు ప్రజలు తరలివస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ఎవరు పేద వారో.. ఎవరు పెత్తందారో ప్రజలు తెలుసుకోవాలి. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్. ఎక్కువ మంది పేదలు ఉన్న రాష్ట్రం ఏపీ. విలాసవంతమైన భవనాలు కట్టుకోవడంలో ఆయనే నంబర్ వన్. అనేక ప్యాలెస్లు కట్టుకున్న జగన్.. పేద వాడా? పెత్తందారా? ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వేధించారు. ఇప్పుడున్న ఇంటి కాలనీలన్నీ ఉంటాయి.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. పిల్లలు, యువత భవిష్యత్తుకు గ్యారంటీ నాది.నేనేం చేశానని జగన్ అడుగుతున్నారు..చరిత్ర చూడాలి. నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశాం. పేద పిల్లలు ఉన్నత విద్య చదువుకునేలా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి ప్రోత్సహించాం’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ