UP Polls: రాయ్బరేలీ సర్దార్.. 30 ఏళ్లుగా ఇక్కడ ఒక కుటుంబానిదే గెలుపు..!
కాంగ్రెస్, పీస్ పార్టీ, భాజపా.. పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ఆ ఒక్క కుటుంబానిదే. గత మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం.. ఒక కుటుంబానికి చెందిన నేతలకే
రాయ్బరేలీ: కాంగ్రెస్, పీస్ పార్టీ, భాజపా.. పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ఆ ఒక్క కుటుంబానిదే. గత మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం.. ఒక కుటుంబానికి చెందిన నేతలకే పట్టం కడుతోంది. అదే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాయ్బరేలీ సర్దార్ అసెంబ్లీ స్థానం. 1993 నుంచి ఈ నియోజకవర్గంలో అఖిలేశ్ సింగ్, ఆయన కుమార్తె ఆదితిసింగ్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడుగా పేరొందిన అఖిలేశ్ సింగ్ 1993లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో రాయ్బరేలీ సర్దార్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన విజయాల పరంపర కొనసాగింది. 1996, 2002లోనూ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత అఖిలేశ్ సింగ్కు కాంగ్రెస్తో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ ఆయనను బహిష్కరించింది.
దీంతో 2007లో జరిగిన ఎన్నికల్లో అఖిలేశ్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 76వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2012 ఎన్నికల సమయంలో పీస్ పార్టీలో చేరి పోటీ చేశారు. అప్పుడు కూడా రాయ్బరేలీ సర్దార్ ప్రజలకు ఆయనకే ఓటేశారు. 2017 ఎన్నికలకు ముందు అఖిలేశ్ సింగ్ రాజకీయాల నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె అదితి సింగ్ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది కాంగ్రెస్ పార్టీపై పలుమార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన అదితి.. 2021లో భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో కాషాయ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న అదితి.. మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు.
అదితికి పోటీగా కాంగ్రెస్ పార్టీ.. మనీశ్ చౌహన్ను బరిలోకి దించగా.. సమాజ్వాదీ పార్టీ ఆర్పీ యాదవ్ను నిలబెట్టింది. మరో విషయం ఏంటంటే.. యూపీలో సమాజ్వాదీ పార్టీ ఇంతవరకూ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గం కూడా ఇదేనట. దీంతో రాయ్బరేలీ నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి నాలుగో విడతలో భాగంగా బుధవారం(ఫిబ్రవరి 23) పోలింగ్ జరగనుంది. అన్ని విడతలు పూర్తయిన తర్వాత మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా