Nitish Kumar: చేయని పనికి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు.. రాహుల్కు నీతీశ్ కౌంటర్
బిహార్లో కులగణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను జేడీయూ అధ్యక్షుడు, సీఎం నీతీశ్ కుమార్ తోసిపుచ్చారు.
పట్నా: కాంగ్రెస్ (Congress) ఒత్తిడితోనే బిహార్ (Bihar)లో కులగణన (Caste Survey) జరిగిందన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలను జేడీయూ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar) తోసిపుచ్చారు. మరొకరు చేసిన పనిని తామే చేసినట్లు ఆయన తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారని విమర్శించారు. ‘‘బిహార్లో కులగణన నా చొరవతో జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. 2019-20 మధ్య అసెంబ్లీ సహా.. బహిరంగ సభల వరకు ప్రతిచోటా ఈ విషయాన్ని ప్రస్తావించాను. ప్రధానిని కూడా కలిశాను. ఇప్పుడు దీనికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు లబ్ధి పొందాలనుకుంటే నేను పట్టించుకోను. ఆయనవి అర్థంలేని వ్యాఖ్యలు’’అని నీతీశ్ అన్నారు.
ఒంటరి పోటీపై ప్రకటన చేయండి.. ఇండియా కూటమి పార్టీలను కోరిన కాంగ్రెస్
ఇండియా కూటమిలోని పార్టీలు ఏం చేయట్లేదని, కనీసం సీట్ల సర్దుబాటుపైనా చర్చించడం లేదని తెలిపారు. కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టాలని తాను చెప్పలేదని, వాళ్లే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇకపై ఎన్డీయేను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ను ఈడీ విచారించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ ఆయనపై ఉన్న ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. దర్యాప్తు జరుగుతోంది. వాటి గురించి నేను ఎవరినీ అడగలేదు. నాకు ఎవరూ చెప్పలేదు’’ అని అన్నారు.
గత వారం ఇండియా కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన నీతీశ్ కుమార్పై భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్గాంధీ విమర్శలు చేశారు. ‘‘నీతీశ్ విపక్ష కూటమిని ఎందుకు వీడారో తెలుసు. బిహార్లో కులగణన చేపట్టాలని మేం ఆయనకు స్పష్టంగా చెప్పాం. దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ ఒత్తిడి తీసుకువచ్చాయి. అందుకు భాజపా వ్యతిరేకం. దీంతో నీతీశ్ ఇరుక్కుపోయారు. ఆయన తప్పించుకోవడానికి భాజపా దారి చూపించింది. సామాజిక బాధ్యత అందించడం కూటమి బాధ్యత. దానికి ఆయన అవసరం లేదు. కొంచెం ఒత్తిడి వచ్చినా యూటర్న్ తీసుకుంటారు’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా