India Alliance: ఒంటరి పోటీపై ప్రకటన చేయండి.. ఇండియా కూటమి పార్టీలను కోరిన కాంగ్రెస్
ఇండియా కూటమిలోని పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే దానిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ కోరింది.
కతిహార్: సార్వత్రిక ఎన్నికలు (LokSabha Elections 2024) సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు విషయంలో ‘ఇండియా కూటమి (INDIA Alliance) పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ (TMC), పంజాబ్లో ఆప్ (AAP)లు ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు కూటమికి షాకిస్తూ.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఎన్డీయేతో జట్టు కట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ (Congress) కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇప్పటివరకు కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలన్నీ ఒకే గొంతుక వినిపించాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే.. దానిపై ప్రకటన చేయాలి. పశ్చిమబెంగాల్లో కూడా కూటమి కలిసి పోరాడుతుందని భావిస్తున్నాం’’ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.
నేను బతికున్నంతవరకు బెంగాల్లో సీఏఏ అమలు కానివ్వను: మమత
లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో కూటమి పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ముందుకు రాకపోవడంతో కూటమి నుంచి పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ