Rahul Gandhi: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో రాహుల్ స్వచ్ఛంద సేవ
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు.
Image : VikasKumar_INC
అమృత్సర్: కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని (Golden Temple) సందర్శించారు. ఆధ్యాత్మిక సందర్శనలో భాగంగా ఆయన తన తలకు బ్లూ స్కార్ఫ్ ధరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు. అనంతరం భజన బృందం సభ్యులతోపాటు కూర్చొని గుర్బానీ కీర్తనలు విన్నారు. ఈ పర్యటన కోసం రాహుల్ ప్రత్యేక విమానంలో అమృత్సర్ చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గత జనవరిలోనూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ దర్బార్ సాహిబ్ను సందర్శించారు.
సీఐడీ పేరు మార్చుకొని ‘జేపీఎస్’గా పెట్టుకోవాలి: సీపీఐ రామకృష్ణ
అంతకముందు రాహుల్ పర్యటన గురించి వివరిస్తూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా వారింగ్ ట్విటర్ (ఎక్స్)లో పోస్టు పెట్టారు. ‘రాహుల్ గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు అమృత్సర్ సాహిబ్కు వస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత, ఆధ్యాత్మిక యాత్ర. కాబట్టి ఆయన గోప్యతను మనం గౌరవించాలి. ఆయనను కలిసేందుకు పార్టీ కార్యకర్తలెవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి పర్యటనకు వచ్చిన సమయంలో మీరంతా సమావేశమయ్యే ఏర్పాట్లు చేస్తామని’ అందులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా