Rahul Gandhi: క్షమాపణ ఎందుకు చెప్పాలి?: రాహుల్ గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ సహా 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఎంపీలపై శీతకాల సమావేశాలు
దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ సహా 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఎంపీలపై శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. అయితే, దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ఈ 12 మంది ఎంపీలు సభకు, ఛైర్మన్కు క్షమాపణ చెబితే.. సస్పెన్షన్పై ప్రభుత్వం పునరాలోచిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. క్షమాపణ చెప్పేదే లేదని స్పష్టం చేశారు. ‘క్షమాపణ ఎందుకు చెప్పాలి? పార్లమెంట్లో ప్రజల సమస్యలను లేవనెత్తినందుకా? క్షమాపణ చెప్పేదే లేదు’’అని ట్విట్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కూడా స్పందిస్తూ.. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంపీల సస్పెన్షన్పై మరో ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఈ సస్పెన్షన్ గురించి.. ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా విపక్ష నాయకుల్ని కోరాం. పరిష్కారం దొరక్కపోతే.. ఎంపీలందరితో కలిసి శీతాకాల సమావేశాల మొత్తం సెషన్ను బహిష్కరించడంపై ఆలోచిస్తాం’’అని తెలిపారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి