Rahul Gandhi: కోలార్ నుంచే రాహుల్ ప్రచారం .. దానికో కారణముంది..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ..కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పరువు నష్టం కేసులో జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణముంది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్రంలో భాజపాను గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలో రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏప్రిల్ ఐదు నుంచి కోలార్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక కారణముంది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేసింది ఇక్కడే కావడం గమనార్హం. ఇది భాజపా ఆగ్రహానికి దారితీసింది. ఇది ఓ వర్గాన్ని కించపరిచినట్లు కమలం పార్టీ పరిగణించింది. దాంతో గుజరాత్లో కేసు నమోదైంది. ఆ పరువునష్టం కేసులో ఇటీవల సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. అధికార భాజపా తీరుకు నిరసనగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వరుణ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
రాహుల్ జైలుశిక్షపై పైకోర్టుకు..!
పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం విధించిన జైలుశిక్షపై కాంగ్రెస్(Congress) పై కోర్టును ఆశ్రయించనున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పిటిషన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే సవాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రివ్యూ పిటిషన్పై పార్టీకి చెందిన న్యాయసలహాదారులు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారని, ఒకట్రెండు రోజుల్లో దీనిని దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ