Aryan Khan: ఆర్యన్ అరెస్టుపై మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు వ్యవహారంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన .....
ముంబయి: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు వ్యవహారంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతంలోని క్రూజ్ నౌకలో ఎన్సీబీ దాడులు నకిలీవన్నారు. అక్కడ డ్రగ్స్ ఏమీ దొరకలేదని వ్యాఖ్యానించారు. షారుక్ని టార్గెట్ చేసినట్టు నెలక్రితమే సమాచారం వచ్చిందన్న ఆయన.. క్రైం రిపోర్టర్ల గ్రూపుల్లో సమాచారం చక్కర్లుకొట్టిందని విమర్శించారు. నౌకలో దాడుల సమయంలో ఎన్సీబీ బృందంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని ప్రశ్నించిన ఆయన.. వారిలో ఒకరు భాజపాకు చెందినవారు అని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ని అక్రమంగా అరెస్టుచేశారన్నారు. ఆర్యన్ అరెస్టు వెనక భాజపా కార్యకర్తల హస్తం ఉందని మంత్రి ఆరోపించారు.
ఎన్సీబీ సోదాల సమయంలో అక్కడ ఉన్న కేపీ గోసావి, మనీశ్ భానుషాలి ఎవరో, ఆ షిప్లో ఎందుకు ఉన్నారో భాజపా, ఎన్సీబీ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరిలో ఒకరు భాజపా ముఖ్య నేతలతో ఫొటోలను పోస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వీరితో భాజపాకు ఉన్న సంబంధమేంటని నిలదీశారు. భాజపా ఎన్సీబీని వాడుకొని మహారాష్ట్రపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న క్రూజ్ నౌకలో నిర్వహించిన ఓ రేవ్పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న అభియోగంపై ఆర్యన్ సహా ఎనిమిది మందిని అధికారులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ముంబయి సిటీ కోర్టు ఆర్యన్ సహా పలువురు నిందితులకు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది.
ఓ సాక్షిగానే అక్కడికి వెళ్లా.. మనీశ్ భానుషాలి
మరోవైపు, మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై భాజపా కార్యకర్త మనీశ్ భానుషాలి స్పందించారు. తనపై మంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అక్టోబర్ 1న తనకు సమాచారం వచ్చిందని, తన స్నేహితుడు ఒకరు ఎన్సీబీకి సమాచారం ఇవ్వాలని చెప్పాడన్నారు. అప్పటికే ఎన్సీబీ వద్ద కొంచెం సమాచారం ఉండటంతో ఇది మరింత ఉపయోగపడిందన్నారు. అక్టోబర్ 2న దాడులకు ప్రణాళిక రచించగా.. ఓ సాక్షిగా తాను ఆ ప్రదేశంలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు తాను ఏ భాజపా నేతతోనూ మాట్లాడలేదని, తనకు, ముంబయిలోని తన కుటుంబానికి పోలీస్ రక్షణ కావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్