Revanth Reddy: బండ్ల గణేశ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ... ఏం చర్చించారంటే?

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ దాదాపు 2గంటలపాటు ఆయనతో చర్చించారు

Updated : 25 Jun 2022 15:35 IST

హైదరాబాద్‌: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ దాదాపు 2గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న గణేశ్‌ ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు కోరినట్టు తెలుస్తోంది. 

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్‌ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో డీలాపడ్డారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై  ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్‌ ను యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని