Revanth Reddy: రాష్ట్రంలో భాజపా రెండుగా చీలిపోయింది: రేవంత్రెడ్డి
రాష్ట్రంలో భాజపా రెండుగా చీలి పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
హైదరాబాద్: రాష్ట్రంలో భాజపా రెండుగా చీలి పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా భాజపా చీలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని పదే పదే చెబుతున్న బండి సంజయ్.. కేసీఆర్ అవినీతి చిట్టాను నిన్న హో మంత్రి అమిత్షాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిర్మల్లో భాజపా సభతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్లో కాంగ్రెస్ సభ విజయవంతమైందన్న రేవంత్ .. కార్యకర్తలు సత్తా చూపారని ప్రశంసించారు. గజ్వేల్కు ఎలా వస్తారో చూస్తామని కేటీఆర్ బృందం బెదిరించిందని, కేసీఆర్ ఊహించిన దానికంటే ఎక్కువ మంది గజ్వేల్ సభకు వచ్చారని తెలిపారు. కార్యకర్తలే రవాణా ఖర్చులు భరిస్తూ కాంగ్రెస్ సభలకు వస్తున్నారని, తెరాసపై వ్యతిరేకతకు జనాదరణే నిదర్శనమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
‘‘గ్రీన్ చాలెంజ్ మాదిరి వైట్ ఛాలెంజ్ విసురుతున్నా. మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసురుతున్నా. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ వద్దకు వస్తా. మీరు ఏ హాస్పిటల్కు రమ్మంటే అక్కడికి వస్తా. వైట్ ఛాలెంజ్లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్దాం. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దాం. యువతరాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించరు. ఒక మంత్రిగా మీరెందుకు జోక్యం చేసుకోకూడదు. డ్రగ్స్ కేసులో ఈడీకి అబ్కారీశాఖ వివరాలు ఎందుకు ఇవ్వలేదు’’ అని రేవంత్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా