Rajasthan : రాజస్థాన్ అసెంబ్లీలో ఘర్షణ.. పదవీచ్యుతుడైన రాజేంద్ర సింగ్ గుడా బహిష్కరణ
మణిపుర్ (Manipur) కన్నా రాజస్థాన్లోనే (Rajasthan) మహిళలకు భద్రత కరవైందని విమర్శించిన మంత్రి రాజేంద్ర సింగ్ గుడాను (Rajendra Gudha) సీఎం అశోక్ గహ్లోత్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన, కొందరు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు.
Image : Vishnu Vardhan Reddy
జైపుర్ : రాజస్థాన్లో (Rajasthan) సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విమర్శలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్న రాజేంద్ర సింగ్ గుడా (Rajendra Gudha) ఇవాళ మరోసారి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే రఫీఖ్ ఖాన్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్ను చుట్టుముట్టారు. వెంటనే రాజేంద్ర సింగ్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ పద్ధతి మంచిది కాదని వారించిన స్పీకర్ సీపీ జోషితోనూ వాగ్వాదానికి దిగారు. దాంతో స్పీకర్ మార్షల్స్ను పిలిపించి రాజేంద్రను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. తరువాత సభను వాయిదా వేశారు.
అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. రాజకీయ పరిణామాలపై చర్చ
ఈ ఘటనపై రాజేంద్ర సింగ్ గుడా విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రులతో సహా ఐదు నుంచి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టి నాపై ముష్టిఘాతాలు కురిపించారు. సభలోనే నాపై చేయి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టారు. మంత్రి ధరివాల్ సైతం దాడి చేశారని’ ఆయన ఆరోపించారు. సభ నుంచి బయటకు గెంటేసిన తరువాత రాజేంద్ర అసెంబ్లీ భవనం పరిసరాల్లోకి రాకుండా మార్షల్ నిలువరించారు. సాధారణంగా ఎమ్మెల్యే ప్రవర్తన బాగా లేకపోతే స్పీకర్ సభ నుంచి మాత్రమే బయటకు పంపిస్తారు.
ఇదీ నేపథ్యం..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కనీస ఆదాయ హామీ బిల్ 2023పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మణిపుర్ ఘటనపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో మంత్రి గుడా మట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే మహిళలకు రక్షణ కల్పించడంలో మనం విఫలమయ్యాం. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయి. మణిపుర్ ఘటనపై మనం ప్రశ్నలు లేవనెత్తేముందు తొలుత మన రాష్ట్రంలో జరుగుతున్న తీరును ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని మంత్రి రాజేంద్ర సింగ్ గుడా అన్నారు.
దీంతో విపక్ష భాజపా ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్ర మంత్రే స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతున్నాడంటే ఇది ప్రభుత్వం మాట్లాడినట్లే. ప్రభుత్వ తీరును స్వయంగా మంత్రి బట్టబయలు చేశారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు మంత్రికి కృతజ్ఞతలు. కానీ, ఇది అవమానకర విషయం అని భాజపా నేత రాజేంద్ర రాథోడ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో మంత్రి గుడా తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సీఎం గహ్లోత్ సిఫారసు చేశారు. దీంతో వెంటనే గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం