BRS: కేసీఆర్తో పాటు జాతీయ నేతల ఖమ్మం పర్యటన.. కంటివెలుగు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు జాతీయ నేతల ఖమ్మం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని వారు ప్రారంభించారు.
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు జాతీయ నేతల ఖమ్మం పర్యటన కొనసాగుతోంది. భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యేందుకు దిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు ఇవాళ యాదాద్రి చేరుకున్నారు. విజయన్, డి.రాజా మినహా మిగతా నేతలు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నేతలకు హారతి, తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను నేతలు తిలకించారు. ఆలయ విశిష్టత, ఆధునికీకరణకు సంబంధించిన వివరాలను నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు.
స్వామివారి దర్శనం అనంతరం నూతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రాంరభించారు. కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్, డి.రాజా, అఖిలేశ్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ సీఎం విజయన్ చేతుల మీదుగా కలెక్టరేట్ శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురికి కళ్లద్దాలు అందించారు. కలెక్టరేట్లో కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వారు తిలకించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి మంత్రి హరీశ్రావు, సీఎస్ శాంతి కుమారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు