Karnataka Polls: భాజపాను అందుకే వీడుతున్నారు : సీఎం బొమ్మై
కర్ణాటక (Karnataka Elections) భాజపాలో ఇటీవల పెరుగుతున్న కీలక నేతల రాజీనామాలపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) స్పందించారు. ఇక్కడ టికెట్టు రాని అసంతృప్త నేతలే పార్టీని వీడుతున్నారని అన్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Elections) సమయం దగ్గర పడుతున్న వేళ.. అధికార పక్షానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ నుంచి కీలక వ్యక్తులు ఒక్కొక్కరు రాజీనామా (Resignations) చేసి వెళ్లిపోతుండటం కాషాయ పార్టీని కలవరపెడుతోంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) స్పందించారు. శాసనసభ్యులుగా ఎన్నిక కావాలనే ఆశతో కొందరు నేతలు భాజపాను వీడిపోతున్నారని.. కానీ, కార్యకర్తలు మాత్రం పార్టీకే అంకితమై ఉన్నారని అన్నారు.
‘అధికారపక్షంలో ఉన్నందున అసెంబ్లీ టికెట్ల విషయంలో భారీ డిమాండ్ ఉండటం సర్వసాధారణమే. మేం మా కార్యకర్తలతో మాట్లాడుతూనే ఉన్నాం. వారు నిబద్ధతతో పార్టీకే అంకితమై ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే కావాలనే ఆశతో కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తమ పార్టీలో టికెట్ రానటువంటి అసంతృప్త నేతలను కాంగ్రెస్ చేర్చుకుంటోంది. అది పెద్ద విషయమేమీ కాదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. ఇక భాజపాలోని రెబల్ నేతలతో కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉందని వస్తోన్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా.. ఘన చరిత్ర ఉన్న ఆ పార్టీకి (కాంగ్రెస్కు) 60 స్థానాల్లో సరైన అభ్యర్థులే లేరని కాంగ్రెస్ను ఎద్దేవా చేశారు.
ఇదిలాఉంటే, కర్ణాటకలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని భాజపా, ఎలాగైనా ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇటీవల అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుండడంతో టికెట్ రాని, అసంతృప్త నేతలు భాజపాను వీడి కాంగ్రెస్, జేడీఎస్లో చేరిపోతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈయనకంటే ముందు పలువురు కీలక నేతలు కూడా భాజపాను వీడటం అధికార పార్టీని కలవరపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు