Chandrababu: శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం
తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో భావోద్వేగానికి గురయ్యారు.
అమరావతి: తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సభలో తన సతీమణి గురించి వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన మైక్ను కట్ చేశారు.
ఈరోజు సభలో చంద్రబాబుపై వైకాపా సభ్యులు పలు ఆరోపణలు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ‘‘8వసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టాను. 1978 నుంచి హేమాహేమీలతో పనిచేశాను. ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. కానీ గత రెండున్నరేళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం. కుప్పం ఎన్నిక ఫలితం తర్వాత తనను చూడాలని సీఎం జగన్ వ్యాఖ్యానించినా దాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈరోజు సభలో నా సతీమణి గురించి కూడా ఆరోపణలు చేశారు’’ అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ క్రమంలో ఆయన మైక్ను స్పీకర్ తమ్మినేని సీతారాం కట్ చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభలో జరిగిన పరిణామాలపై కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!