Kejriwal: కేజ్రీవాల్.. ఆలయాలను ఎందుకు సందర్శిస్తున్నారంటే..?
తాను కూడా హిందువును కాబట్టే దేవాలయాలను సందర్శిస్తున్నానని.. అందులో మిగతావారికి అభ్యంతరమేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
సాఫ్ట్ హిందుత్వ విమర్శలపై స్పందించిన దిల్లీ సీఎం
దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య వరుసగా ఆలయాలను కూడా సందర్శిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన హిందుత్వ వైపు సున్నితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి విమర్శలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. తాను కూడా హిందువును కాబట్టే దేవాలయాలను సందర్శిస్తున్నానని.. అందులో మిగతావారికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
‘నేను హిందువును కాబట్టి ఆలయాలకు వెళ్తాను. నా భార్య కూడా ఓ ఆలయాన్ని సందర్శించారు. దాంట్లో తప్పేముంది. ఎవరైనా ఆలయాలను సందర్శించినప్పుడు ప్రశాంతత లభిస్తుంది. వీటికి కొందరు సాఫ్ట్ హిందుత్వ అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను గుడికి వెళ్తే వారికేంటి అభ్యంతరం..? అంటూ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రెండు రోజుల గోవా పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ సాఫ్ట్ హిందుత్వపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
మరికొన్ని నెలల్లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పటికే భాజపా, తృణమూల్ కాంగ్రెస్తో పాటు ఆమ్ఆద్మీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏఏపీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో రెండు రోజుల పర్యటనతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే తీర్థయాత్రల కోసం ప్రత్యేక కార్యక్రమంతో పాటు 24గంటల ఉచిత కరెంటు, జాబ్ గ్యారంటీ వంటి హామీలను ప్రకటించారు. ఇక గడిచిన కొన్ని నెలల్లో అరవింద్ కేజ్రీవాల్ గోవాలో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు