AP News: కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగడం హీనం: పేర్ని
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన శాసనసభలో రాలేదని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆమెను ఉద్దేశించి ఎవరూ ఏమీ అనలేదన్నారు. నిజంగానే
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన శాసనసభలో రాలేదని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆమెను ఉద్దేశించి ఎవరూ ఏమీ అనలేదన్నారు. నిజంగానే నిన్న బ్లాక్ డే అన్న మంత్రి నాని.. కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగి చరిత్రను హీనం చేశారన్నారు. చంద్రబాబు చెప్పేవి అసత్యాలేనని, జరగని విషయాలను ఆయన రాజకీయా ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు.
‘‘వాస్తవాలు మాట్లాడితేనే చంద్రబాబునాయుడి అనుభవానికి పరమార్థం ఉంటుంది. బాలకృష్ణ, ఆయన తోబుట్టువులు వైకాపా సభ్యులు ఏదో అనేసినట్లు మాట్లాడటం బాధాకరం. అప్పట్లో ఎన్టీఆర్ ఏదో చేసేస్తారని కన్నబిడ్డలనే నమ్మించి ఆయనకు వ్యతిరేకంగా మారేలా చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఇద్దరు శాసన సభ్యులు ఏదో అన్నారని సృష్టించటం, నమ్మించటం చాలా చిన్న విషయం. ఆనాడు రామారావుకు వ్యతిరేకంగా, వారి కుటుంబాన్ని నిలిపి ఆయనకు మానసిక క్షోభ కలిగించేలా, కుంగదీసేలా చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అసలు అసెంబ్లీలో గొడవకు కారణమైంది ఆయనే. వ్యవసాయంపై చర్చ జరుగుతుంటే, ఒక శాసనసభ్యుడిని ప్రేరిపించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సభలో సీఎం జగన్మోహన్రెడ్డి లేకపోయినా పని గట్టుకుని ఆయనపై విమర్శలు చేశారు. ‘మీ బాబాయ్ హత్యపై, గొడ్డలిపై, తల్లి, చెల్లిపై చర్చిద్దాం’ అని చంద్రబాబు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ఏపీ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుదామనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. నిరసన తెలపాలని ప్రజలను కోరుతున్నారు. అసలు ఎందుకు నిరసన తెలిపాలి? అర్థం పర్థం లేకుండా ఇలాంటి వాటికి పిలుపునివ్వటం ఎందుకు’’ అని పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్