Raghurama: అన్నీ తెలిసి నాకెందుకు టికెట్‌ ఇచ్చారు?

నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

Published : 24 Jul 2021 15:17 IST

దిల్లీ: నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలిపోతాయన్నారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తమిళనాడులో నమోదైన కేసుకు సీఎం జగన్‌, బాలశౌరి కారణమని పేర్కొన్నారు. తన గురించి అన్నీ తెలిసి పార్టీ టికెట్‌ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఒకరు 16నెలలు జైల్లో ఉండి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారని.. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖను లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని విషయాలు పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని