Nara Lokesh: రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన లోకేశ్‌

హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

Updated : 16 Aug 2021 14:05 IST

గుంటూరు: హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. గుంటూరు నగరంలోని పరమయ్యగుంటలో రమ్య ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.

తెదేపా-వైకాపా శ్రేణుల తోపులాట

మరోవైపు కేవలం రాజకీయ లబ్ధికే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పరమయ్యగుంటలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పరామర్శకు వస్తే ప్రభుత్వానికి ఉలుకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగడం లేదని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్‌ను పోలీసులు అక్కడి నుంచి పంపించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు