Somu Veerraju: ఆంగ్లేయులది, జగన్‌ది ఒకటే మనస్తత్వం: సోము వీర్రాజు

‘‘ఆంగ్లేయులది, సీఎం జగన్‌ మనస్తత్వం ఒకటే’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మతం మారలేదని ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎస్సీలపై అధికార పార్టీ నేతలు దాడి..

Updated : 28 Jul 2021 14:00 IST

అమరావతి: ‘‘ఆంగ్లేయులది, సీఎం జగన్‌ మనస్తత్వం ఒకటే’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మతం మారలేదని ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎస్సీలపై అధికార పార్టీ నేతలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ నిషేధంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాజపా ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. బలవంతపు మత మార్పిడిని భాజపా ఉపేక్షించదని చెప్పారు. వైకాపా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలే తమ అభివృద్ధి అంటోందన్నారు. కేంద్ర వంద రత్నాలను ప్రజలకు అందించిందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర సహకారంపై చర్చకు వైకాపా సిద్ధమా అన్ని ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని