AP News: చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై రెండు కేసుల నమోదు

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Updated : 18 Sep 2021 12:03 IST

అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.

శుక్రవారం పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్‌ పెద్దసంఖ్యలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కర్రలు, రాళ్లతో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని