AP News: చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ వ్యాప్తంగా తెదేపా నిరసనలు
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు నిన్న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు నిన్న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. సత్తెనపల్లి- అమరావతి ప్రధాన రహదారిపై ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ నేత సుధాకర్రెడ్డితో పాటు ఇతరులను చిత్తూరు వన్టౌన్కు తరలించారు. జీడి నెల్లూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త చిట్టిబాబును గృహనిర్బంధం చేశారు. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగు యువత నేలపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధర్నా చేయకుండా గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు అడ్డురోడ్డు వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా నంద్యాలలోనూ తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!