Revanth reddy: జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్సైరన్’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దిల్సుఖ్ నగర్ వెళ్లేందుకు ఇంట్లో
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్సైరన్’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దిల్సుఖ్ నగర్ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. గాంధీ జయంతి రోజున నా ఇంటి వద్ద ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని రేవంత్ ప్రశ్నించారు. గృహనిర్బంధం చేస్తే ఆర్డర్ కాపీ చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకోసం అమరుడైన శ్రీకాంత్ చారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.
‘‘ఒక ఎంపీకి నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా? గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. నా గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలి. శ్రీకాంత్ చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్, కేటీఆర్ అనుమతి కావాలి? నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలి. శ్రీకాంత్ చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్, కేటీఆర్కు కోపమెందుకు? కేసీఆర్ తప్ప శ్రీకాంత్ చారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా? నన్ను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే నేను వెనుదిరుగుతా. గాంధీ జయంతి రోజున ఎంపీ కార్యక్రమాలను అడ్డుకుంటారా?’’ అని పోలీసులపై రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దిల్సుఖ్నగర్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఇంటి వద్దే రేవంత్రెడ్డి బైఠాయించారు. కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ముందస్తుగా దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద దుకాణాలు మూసివేయించారు. దిల్సుఖ్నగర్ చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులను ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు.
ఏడేళ్లుగా కొత్త ఉద్యోగాలు లేవు: రేవంత్రెడ్డి
పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే బైఠాయించిన రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. కొత్తవి దేవుడెరుగు.. పాతవి కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఉద్యో్గాలు భర్తీ చేయడంలేదు. ఎందుకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడంలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ 65 రోజుల పోరాటానికి పూనుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ లోని శ్రీకాంత్ చారి విగ్రహం వరకు ర్యాలీ తీయాలనుకున్నాం. కానీ, వందలాది మంది పోలీసులతో అడ్డుకుంటున్నారు’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!