అక్కడ థర్డ్ఫ్రంట్ సక్సెస్ కాలేదు: నారాయణ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే స్పష్టమైన పోటీ ఉంటుందని, ఈ అక్కడ తృతీయ కూటమి విజయవంతం కాలేదని సీపీఐ జాతీయ .......
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే స్పష్టమైన పోటీ ఉంటుందని, ఈ అక్కడ తృతీయ కూటమి విజయవంతం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు దిశగా చేస్తోన్న ఆలోచనపై ఆయన స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. తమిళనాడులో రెండు బలమైన పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు తృతీయ కూటమి వైపు ఆకర్షితులుకారన్నారు. అందువల్ల తృతీయ కూటమికి విజయావకాశాలు కష్టమేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు డీఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందే తమిళనాడులోని వన్నియర్లకు సీఎం పళనిస్వామి రిజర్వేషన్లు ప్రకటించడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఎలాంటి చర్చ చేపట్టకుండా ఒక కులానికి రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడం కూడా బాధ్యతారాహిత్యం, అవకాశవాదమని మండిపడ్డారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని నారాయణస్వామి ప్రభుత్వాన్ని అనైతిక పద్ధతిలో కేంద్రం పడగొట్టిందని, అక్కడ మళ్లీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.
జగన్.. లేఖలు రాస్తే సరిపోదు!
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు