అక్కడ థర్డ్ఫ్రంట్ సక్సెస్ కాలేదు: నారాయణ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే స్పష్టమైన పోటీ ఉంటుందని, ఈ అక్కడ తృతీయ కూటమి విజయవంతం కాలేదని సీపీఐ జాతీయ .......
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే స్పష్టమైన పోటీ ఉంటుందని, ఈ అక్కడ తృతీయ కూటమి విజయవంతం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు దిశగా చేస్తోన్న ఆలోచనపై ఆయన స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. తమిళనాడులో రెండు బలమైన పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు తృతీయ కూటమి వైపు ఆకర్షితులుకారన్నారు. అందువల్ల తృతీయ కూటమికి విజయావకాశాలు కష్టమేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు డీఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందే తమిళనాడులోని వన్నియర్లకు సీఎం పళనిస్వామి రిజర్వేషన్లు ప్రకటించడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఎలాంటి చర్చ చేపట్టకుండా ఒక కులానికి రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడం కూడా బాధ్యతారాహిత్యం, అవకాశవాదమని మండిపడ్డారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని నారాయణస్వామి ప్రభుత్వాన్ని అనైతిక పద్ధతిలో కేంద్రం పడగొట్టిందని, అక్కడ మళ్లీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.
జగన్.. లేఖలు రాస్తే సరిపోదు!
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!