Agnipath scheme: ‘అగ్నిపథ్’ తప్పనిసరి కాదు.. ఎంతో ఆలోచించి తీసుకొచ్చాం
సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు
సికింద్రాబాద్ ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి
దిల్లీ: సుదీర్ఘ ఆలోచనలు, ఎన్నో చర్చల తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’(Agnipath) విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు. సికింద్రాబాద్లో పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు
‘అగ్నిపథ్’ తప్పనిసరి కాదు..
‘‘ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరవచ్చు.. ఇందులో బలవంతం లేదు. దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే ‘అగ్నిపథ్’లో పాల్గొంటారు. ఇజ్రాయిల్లో 12 నెలలు, ఇరాన్లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. భారత్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేయట్లేదు. ‘అగ్నిపథ్’ వీరుడు బయటకు వచ్చాక 10 మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
పోలీసులు ఎందుకు రాలేదు..?
కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తే దాడులు జరగడం దురదృష్టకరం. ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణం. సికింద్రాబాద్ ఘటనలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు. సికింద్రాబాద్ స్టేషన్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్లు తగలబెట్టారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు.. సంయమనం పాటించాలి. రైల్వే కోచ్లకు కూడా నిప్పుపెట్టారు.. బోగీలన్నీ ధ్వంసమయ్యాయి. ఇన్ని జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదు.
చర్చలకూ సిద్ధమే..
నిన్న రాజ్భవన్ ఎదుట ఆందోళన జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు సకాలంలో పట్టించుకోలేదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ‘అగ్నిపథ్’ పథకం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించి తీసుకొచ్చాం. ‘అగ్నిపథ్’పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతోనూ చర్చలకు సిద్ధమే. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని కిషన్ రెడ్డి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్