Varun Gandhi: రాత్రిపూట కర్ఫ్యూ.. పగటిపూట ర్యాలీలు.. వరుణ్ గాంధీ మరో ట్వీట్
సాగు చట్టాల విషయంలో గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో
ఇంటర్నెట్డెస్క్: సాగు చట్టాల విషయంలో గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరుగుతుండటంపై ఆయన తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు. ఓవైపు రాత్రిపూట కర్ఫ్యూ విధించి.. పగలు మాత్రం ర్యాలీలు చేపడుతున్నారంటూ పరోక్షంగా భాజపాపై విమర్శలు గుప్పించారు.
‘‘రాత్రిపూట కర్ఫ్యూ విధించడం.. పగలేమో ర్యాలీలకు లక్షల మందిని పిలవడం.. సామన్య ప్రజలకు ఎంతకీ అంతుపట్టని విషయమిది. ఉత్తరప్రదేశ్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మనమంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడమా.. లేదా ఎన్నికల ప్రచార శక్తిని ప్రదర్శించడమా.. ఈ రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిజాయతీగా నిర్ణయించుకోవాలి’’ అని వరుణ్ గాంధీ ట్విటర్లో రాసుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అక్కడ ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ ర్యాలీలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. మరోవైపు యూపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల యోగి సర్కారు డిసెంబరు 25 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!