Parliament: ఆ ఘటన నన్నెంతో బాధించింది: ఓం బిర్లా
సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు కొందరు నిన్న సభలో ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో బాధించిందని ......
దిల్లీ: పార్లమెంట్లో బుధవారం చోటుచేసుకున్న ఘటనలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు కొందరు నిన్న సభలో ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో బాధించిందని వ్యాఖ్యానించారు. సభాపతి స్థానం (ఛైర్) వైపు ప్లకార్డులు, కాగితాలను చింపి విసరడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోక్సభలో నిన్న కాంగ్రెస్ ఎంపీలు గుర్జీత్ ఆజ్లా, టీఎన్ ప్రతాపన్, హిబి ఇడెన్ సహా కొందరు సభ్యులు పేర్లను చింపి సభాపతి స్థానం వైపు విసరడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కొందరు సభ్యులు విసిరిన ప్లకార్డులు స్పీకర్ పొడియం పైన ఉన్న ప్రెస్ గ్యాలరీలో పడ్డాయి. దీంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభా కార్యకలాపాలు మొదలైనా విపక్ష సభ్యులు నినాదాలతో అడ్డుకోవడంతో గురువారానికి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో గురువారం లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. జులై 28న సభలో చోటు చేసుకున్న ఘటన తనను బాధించిందన్నారు. పేపర్లు చింపేసి విసరడం సభాపతి స్థానాన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పార్లమెంట్ హుందా తననాన్ని దిగజార్చడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్ సంప్రదాయాలను పాటించకపోతే పార్లమెంటరీ ప్రక్రియ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించారు. సభ్యులంతా తమ సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కల్పిస్తామన్నారు. అందరూ పార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ తరహా ఘటనలు మరోసారి పునరావృతం కావొద్దని సూచించారు. పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘‘లోక్సభను ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తాం. సభాపతి స్థానం అందరికీ న్యాయం చేస్తుంది.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఏవైనా ప్రశ్నలుంటే నా గదికి వచ్చి చెప్పవచ్చు. సభాపతి స్థానం గౌరవాన్ని కాపాడేందుకు మీ సలహాలను పాటించేందుకు ప్రయత్నిస్తాను. కానీ, సభ హుందాతనాన్ని పెంచేలా మనమంతా సమష్టి నిర్ణయం తీసుకోవాలి’’ అని ఓం బిర్లా సభ్యులను కోరారు.
మరోవైపు, పెగాసస్ స్పైవేర్తో పలువురి ఫోన్లపై నిఘా ఉంచడం, వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!