UP elections: మేం ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం: మాయావతి
మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.
లఖ్నవూ: మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కాగా.. బహుజన సమాజ్వాది పార్టీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం.. ఒప్పందాలు కుదుర్చుకోం. సొంతంగానే పోటీ చేస్తాం. మేం అన్ని వర్గాల ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. ఆ పొత్తే శాశ్వతంగా ఉంటుంది. 2007 ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తాం’’ అని మాయావతి వెల్లడించారు. అలాగే, సమాజ్వాది, భాజపాలపై మాయావతి విమర్శలు గుప్పించారు. ఎస్పీ, భాజపా మధ్య తేడా ఏమీ లేదని, అవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్యాలు అని అన్నారు. ఈ ఎన్నికలను ఆ రెండు పార్టీలు కేవలం హిందూ-ముస్లింలకు సంబంధించినదిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ఉత్తర్ప్రదేశ్ ప్రజలు నమ్మబోరని మాయావతి అన్నారు. ‘‘ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో 50 శాతం నెరవేర్చినా.. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు’’ అని మాయావతి ఎద్దేవా చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 నియోజకవర్గాలకు గానూ భాజపా 312 చోట్ల విజయం సాధించి అధికారం దక్కించుకుంది. సమాజ్వాది పార్టీ 47 స్థానాల్లో, బహుజన్ సమాజ్వాది 19 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం