Mamata Banerjee: ఇన్నాళ్లూ నా పార్టీ.. ఇప్పుడు నా కుటుంబం: భాజపాపై దీదీ మండిపాటు
పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ తన పార్టీనాయకులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేసిన కాషాయ పార్టీ ఇప్పుడు.. తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు.
కోల్కతా: భాజపాపై పశ్చిమ్బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి మమతాబెనర్జీ (Mamata Benarjee) నిప్పులు చెరిగారు. ఇన్నాళ్లూ తన పార్టీని నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు కొనసాగించిన భాజపా.. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులే లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. ఇందులో భాగంగానే పార్టీ జనరల్ సెక్రెటరీ, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసిందని అన్నారు. బంకురాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమతాబెనర్జీ వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణం కేసులో శనివారం కోల్కతా నిజాం ప్యాలస్లోని కార్యాలయానికి విచారణకు హాజరు కావాంటూ సీబీఐ అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బంకురా పర్యటనలో ఉన్న అభిషేక్ కోల్కతాకు పయనమయ్యారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ వర్చువల్గా మాట్లాడారు.‘‘ మా పార్టీలోని నేతలందరిపై దర్యాప్తు సంస్థల దాడులు పూర్తయ్యాక.. భాజపా దృష్టి నా కుటుంబంపై పడింది. అయినా భయపడేది లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో నోటీసులు జారీ చేయించడం తప్ప భాజపా ఇంకేం చేయగలదు.’’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తృణమూల్ చేపట్టిన యాత్ర విజయవంతమవుతుందనే భయంతోనే భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్రంలో భాజపాను గద్దె దించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు