Deve Gowda : కావేరి జల వివాదంపై అవసరమైతే ప్రధానితో మాట్లాడతా : దేవెగౌడ
కావేరి జల వివాదం (Cauvery issue) పరిష్కారం కోసం అవసరమైతే తాను ప్రధానిని కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ప్రధాని దేవెగౌడ (H.D. Deve Gowda) వ్యాఖ్యానించారు.
బెంగళూరు : కావేరి జల వివాదాన్ని (Cauvery issue) పరిష్కరించేందుకు అవసరమైతే తాను ప్రధాని నరేంద్రమోదీని (Narendra modi) కలిసి మాట్లాడతానని మాజీ ప్రధాని దేవెగౌడ (H.D. Deve Gowda) అన్నారు. హాసన్ సమీపంలోని బైలహల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరి గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన కుమారుడు హెచ్డీ కుమారస్వామి ఇది వరకే చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. జేడీఎస్ వైఖరి స్పష్టమైనందువల్ల ప్రస్తుతం ఆ విషయం గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంశంపై అవసరమైతే ప్రధానిని కలిసి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జలవనరుల మంత్రిత్వశాఖ వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ శాఖకు సంబంధించిన విషయాలు బయటకి చెప్పొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని దేవెగౌడ ఆరోపించారు. జలాశయాల్లో కనీసం నీటిమట్టం ఎంత ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వట్లేదని విమర్శించారు. మంత్రి నుంచి ఆదేశాలు ఉన్నందునే అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్నారు.
ఈ సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలతో చర్చించాల్సింది : అశోక్ గహ్లోత్
ఇటీవల 28 పార్టీల ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం ముంబయిలో జరిగింది. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించారా? కూటమికి కన్వీనర్ను నియమించారా? పొత్తులో భాగంగా సీట్ల పంపకం గురించి చర్చించారా?’ అని ప్రశ్నించారు. కర్ణాటకలో జేడీఎస్.. భాజపాతో అవగాహన కుదర్చుకుందనే వార్తలను దేవెగౌడ తోసిపుచ్చారు. భాజపా ఇంతవరకు అసెంబ్లీలో విపక్ష నేతనే నియమించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాము ఎవరితో చర్చలు జరుపుతామని ప్రశ్నించారు. భాజపా నేతల్లోనే సఖ్యత లేనప్పుడు.. భాజపా, జేడీఎస్ కలిసే ఉన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించడంలో అర్థమే లేదని దేవెగౌడ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు