Ap News: నర్సాపురం వెళ్తున్నా.. రెండు రోజులు అక్కడే ఉంటాను: రఘురామకృష్ణరాజు

ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని..

Updated : 10 Jan 2022 15:53 IST

దిల్లీ‌: ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని