కరోనాను ఐపీఎల్ దాటేసింది
దేశంలో క్రికెట్కు ఎంతో క్రేజ్ ఉందని మరోసారి రుజువైంది. ఈ ఏడాది గూగుల్లో మహమ్మారి కరోనా వైరస్ గురించి కంటే ఐపీఎల్ కోసమే భారతీయులు అధికంగా సెర్చ్ చేశారని ‘గూగుల్ ఇండియా’ తెలిపింది. 2020లో
ఇంటర్నెట్డెస్క్: దేశంలో క్రికెట్కు ఎంతో క్రేజ్ ఉందని మరోసారి రుజువైంది. ఈ ఏడాది గూగుల్లో మహమ్మారి కరోనా వైరస్ గురించి కంటే ఐపీఎల్ కోసమే భారతీయులు అధికంగా సెర్చ్ చేశారని ‘గూగుల్ ఇండియా’ తెలిపింది. 2020లో అత్యధిక మంది ఐపీఎల్ గురించే వెతికారని, రెండో స్థానంలో కరోనా ఉందని నివేదికలో వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు జరిగిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ వీక్షకుల సంఖ్య 28 శాతం పెరిగింది.
అయితే ఐపీఎల్ తర్వాత కరోనా వైరస్, అమెరికా ఎన్నికల ఫలితాలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం, బిహార్, దిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసు, లాక్డౌన్, భారత్-చైనా వివాదం, రామ్మందిర్ ట్రెండింగ్లో నిలిచాయి. ఇక క్రీడలకు సంబంధించి ఐపీఎల్ తర్వాత యూఈఎఫ్ఎ ఛాంపియన్ లీగ్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్, ల లిగ టాప్లో ఉన్నాయి. కాగా, 2019లో దేశంలో ‘ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్’ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
ఈ ఏడాది వ్యక్తుల గురించి అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, సింగర్ కనికా కపూర్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి కంగన రనౌత్, రియా చక్రవర్తి, అంకిత లోఖండే కూడా ట్రెండింగ్లో ఉన్నారు. సినిమా, వెబ్సిరీస్ జాబితాలో దిల్ బెచారా, మనీ హైస్ట్ వరుసగా టాప్లో ఉన్నాయి.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం